టీఎస్ ఆర్టీసీతో తిరుమల యాత్ర మరింత సునాయాసం

byసూర్య | Sun, Mar 19, 2023, 09:49 PM

తిరుమల  వెళ్లాలనుకొనేవారికి ఇది శుభవార్త. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతోందని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణించడం ద్వారా ఏడుకొండలవాడిని దర్శించుకోవడం సులభమని చెప్పారు. రోజుకు వెయ్యి మందికి రూ.300 శీఘ్ర దర్శన టికెట్లు అదుబాటులో ఉంటాయని వివరించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి బస్సులు వెళుతున్నాయని చెప్పారు. మార్చి 18 వరకు టీఎస్ ఆర్టీసీలో ప్రయాణించిన 1,14,565 మందికి తిరుమలలో ప్రత్యేక దర్శనం లభించిందని ఓ ప్రకటనలో గోవర్ధన్ వెల్లడించారు.


వేసవి సందర్భంగా తిరుమలలో రద్దీ పెరుగుతుందని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. దర్శన టికెట్ల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తుందని చెప్పారు. రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల కోసం నెల రోజుల పాటు వేచి చూడాలని, అదే టీఎస్ ఆర్టీసీలో ప్రయాణిస్తే వారం రోజులు చాలని ఆయన వివరించారు. తిరుమల వెళ్లే భక్తులు ఈ సౌకర్యం ఉపయోగించుకోవాలని గోవర్ధన్ తెలిపారు. మరిన్ని వివరాలకు భక్తులు టీఎస్ ఆర్టీసీ వెబ్ సైట్ సందర్శించాలని ఆయన సూచించారు.



Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM