ఢిల్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత,,,రేపటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ

byసూర్య | Sun, Mar 19, 2023, 09:22 PM

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రేపు (మార్చి 20న) విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులిచ్చిన నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే.. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి వెళ్లారు. అయితే.. ఆమె వెంట భర్త అనిల్, అన్న మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా హస్తినకు వెళ్లారు. అయితే.. ఆమె రేపటి ఈడీ విచారణకు సిద్ధమయ్యారా.. లేక మొన్నటి లాగానే అటు వెళ్లి ఇటు వచ్చేస్తారా..? లేదా వేరే ప్లాన్ ఏమైనా ఉందా..? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఇప్పటికే రకరకాల మలుపులు తిరుగుతోంది. అయితే.. మొదటిసారిగా ఈనెల 11న విచారణకు హాజరైన కవితపై ఈడీ అధికారులు ఏకంగా తొమ్మిది గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం మరోసారి విచారణకు హాజరుకావాలంటూ.. నోటీసులిచ్చారు. అయితే.. ఈనెల 16న విచారణకు హాజరుకావాలని నోటీసులివ్వగా.. ఢిల్లీకి వెళ్లారు కానీ.. విచారణకు మాత్రం హాజరుకాలేదు. పైగా.. ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు.


ఇదిలా ఉండగా.. కవితకు ఈడీ మరోసారి నోటీసులు పంపించింది. ఈనెల 20న మరోసారి విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే అరెస్టయిన, కస్టడీలో ఉన్న నిందితులతో కలిపి విచారించాలని ఈడీ భావిస్తోంది. గతంలో అరుణ్ పిళ్లై ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని.. కవిత ఈ కేసులో అనుమానితురాలిగా పేర్కొంటూ ఈడీ విచారణకు నోటీసులు ఇస్తోంది. అయితే.. కవిత మాత్రం ఈడీపై పలు ఆరోపణలు చేస్తూ.. విచారణకు డుమ్మా కొడుతూ వస్తోంది. పైగా.. కవిత వేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది. అయితే.. సుప్రీం ఆదేశాలు వచ్చాకే ఈడీ విచారణకు హాజరవుతానని కవిత స్పష్టం చేస్తోంది.


ఈ క్రమంలోనే ఈడీ అధికారులు కవిత మరో ట్విస్ట్ ఇచ్చారు. కవిత వేసిన పిటిషన్‌పై కేవియట్ దాఖలు చేశారు. తమ వివరణ వినకుండా ఎలాంటి ఆదేశాలు జారీ చేయొద్దని పిటిషన్ వేశారు. దీంతో.. సుప్రీం ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విననుంది. ఇదంతా బాగానే ఉన్నా.. అసలు సుప్రీం ఆదేశాలు వచ్చే వరకు విచారణకు హాజరయ్యేదే లేదంటూ తేల్చేసిన కవిత.. ఈరోజు కేటీఆర్‌ను వెంటబెట్టుకుని హస్తినకు పయనమవ్వటం వెనుక మతలబు ఏంటని సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే.. విచారణకు సిద్ధమై ఉండాలి.. లేకపోతే.. మరేదైనా ప్లాన్ ఉందా.. అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలో అందుబాటులో వుండాలని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సూచన మేరకే కవిత ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం అందుతోంది.



Latest News
 

గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యం Fri, Apr 19, 2024, 03:39 PM
ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును పరిశీలించిన కలెక్టర్ Fri, Apr 19, 2024, 03:38 PM
వ్యాపార కాంక్షతోనే బీబీ పాటిల్ పోటీ Fri, Apr 19, 2024, 03:37 PM
ప్రభుత్వ ఉపాధ్యాయుడి సస్పెన్షన్: డీఈవో రాజు Fri, Apr 19, 2024, 03:35 PM
జాతీయ రహదారిలో ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్ Fri, Apr 19, 2024, 03:33 PM