మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ కన్నుమూత

byసూర్య | Sun, Mar 19, 2023, 08:46 PM

మిల్లెట్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న పీవీ సతీష్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పీవీ సతీష్ అంత్యక్రియలు మార్చి 20న ఉదయం 10.30 గంటలకు సంగారెడ్డిలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పీవీ సతీష్ అసలు పేరు పెరియపట్నం వెంకటసుబ్బయ్య సతీష్. 1945 జూన్ 18న మైసూర్‌లో జన్మించిన ఆయన హైదరాబాద్‌లోని దూరదర్శన్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు.సంగారెడ్డి జహీరాబాద్ జిల్లా కేంద్రంగా దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీని స్థాపించారు. పప్పు దినుసుల సాగు, వినియోగం పెంచడం, సేంద్రియ వ్యవసాయంపై సతీష్ నాలుగు దశాబ్దాలుగా కృషి చేశారు.  


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM