సీవరేజ్ పైపు లైన్ కు నిధులు కేటాయించాలని వినతి

byసూర్య | Sun, Mar 19, 2023, 11:31 AM

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పోరేషన్ చిల్కానగర్ డివిజన్ లోనూతన సీవరేజ్ పైప్ లైన్ కొరకు నిధులు కేటాయించాలని కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ కు శనివారం వినతిపత్రం అందజేశారు. చిల్కానగర్ డివిజన్ శివాలయం వీధి, మల్లికార్జున్ నగర్, న్యూ రాంనగర్, ధర్మపురి కాలనీ, న్యూ అండ్ సౌత్ ప్రశాంత్ నగర్ బస్తీలలో 300 డయా నూతన సీవరేజ్ పైప్ లైన్ల కొరకు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా కాలం కిందట వేసినటువంటి సీవరేజ్ పైపులైన్లు పలుమార్లు మరమ్మతులు చేసినా సరిగా పనిచేయడం లేదని డివిజన్ వాసులు ఇబ్బంది పడుతున్నారని వాటి స్థానంలో నూతన పైప్ లైన్ వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM