సీవరేజ్ పైపు లైన్ కు నిధులు కేటాయించాలని వినతి

byసూర్య | Sun, Mar 19, 2023, 11:31 AM

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కార్పోరేషన్ చిల్కానగర్ డివిజన్ లోనూతన సీవరేజ్ పైప్ లైన్ కొరకు నిధులు కేటాయించాలని కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ కు శనివారం వినతిపత్రం అందజేశారు. చిల్కానగర్ డివిజన్ శివాలయం వీధి, మల్లికార్జున్ నగర్, న్యూ రాంనగర్, ధర్మపురి కాలనీ, న్యూ అండ్ సౌత్ ప్రశాంత్ నగర్ బస్తీలలో 300 డయా నూతన సీవరేజ్ పైప్ లైన్ల కొరకు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా కాలం కిందట వేసినటువంటి సీవరేజ్ పైపులైన్లు పలుమార్లు మరమ్మతులు చేసినా సరిగా పనిచేయడం లేదని డివిజన్ వాసులు ఇబ్బంది పడుతున్నారని వాటి స్థానంలో నూతన పైప్ లైన్ వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు.


Latest News
 

రైతుల కష్టానికి చలించి,,,వామనం దిగిమరీ సహాయం చేసిన ఎస్సై Fri, Mar 31, 2023, 10:05 PM
రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అకాల వర్షం,,,ప్రజలకు కష్టాలు Fri, Mar 31, 2023, 10:04 PM
పేపర్ లీక్ ఘటనలో కీలక మలుపు... దృష్టి సారించిన ఈడీ Fri, Mar 31, 2023, 10:04 PM
లంచం తీసుకున్న కేసులో ఎస్సైకి రెండేళ్ల శిక్ష,,,2013లో జరిగిన కేసులో తీర్పు వెలువరించిన అనిశా కోర్టు Fri, Mar 31, 2023, 10:03 PM
వివాహిత ఆత్మహత్య యత్నం... కాల్ వచ్చిన 3 నిమిషాల్లోనే ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ Fri, Mar 31, 2023, 10:02 PM