రాజన్న సిరిసిల్ల పూర్వ డిఈవో డాక్టర్ రాధా కిషన్ కు జాతీయ పురస్కారం

byసూర్య | Sun, Mar 19, 2023, 10:40 AM

రాజన్న సిరిసిల్ల పూర్వ డీఈవో డాక్టర్ రాధా కిషన్ జాతీయ ఇన్నోవేషన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నీపా) ఈ అవార్డును అందజేయనుంది. రాజన్న సిరిసిల్ల డీఈవోగా ఉన్న కాలంలో సీఎస్సార్‌ నిధులతో బడులను అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనివ్వడంతో రాధాకిషన్‌ కు బెస్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డుల కోసం జాతీయస్థాయిలో ఎన్నో నామినేషన్లు వచ్చిన డీఈవో డాక్టర్ రాధా కిషన్ కృషి అత్యంత ప్రభావితంగా నిలిచింది. డాక్టర్ రాధా కృష్ణతో పాటు మేడ్చల్‌-మల్కాజిగిరి డీఈవో విజయకుమారి కూడ ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈ నెల 23న ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.


Latest News
 

చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం మధు ముదిరాజ్ Fri, Mar 29, 2024, 03:42 PM
బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM