రాజన్న సిరిసిల్ల పూర్వ డిఈవో డాక్టర్ రాధా కిషన్ కు జాతీయ పురస్కారం

byసూర్య | Sun, Mar 19, 2023, 10:40 AM

రాజన్న సిరిసిల్ల పూర్వ డీఈవో డాక్టర్ రాధా కిషన్ జాతీయ ఇన్నోవేషన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నీపా) ఈ అవార్డును అందజేయనుంది. రాజన్న సిరిసిల్ల డీఈవోగా ఉన్న కాలంలో సీఎస్సార్‌ నిధులతో బడులను అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనివ్వడంతో రాధాకిషన్‌ కు బెస్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డుల కోసం జాతీయస్థాయిలో ఎన్నో నామినేషన్లు వచ్చిన డీఈవో డాక్టర్ రాధా కిషన్ కృషి అత్యంత ప్రభావితంగా నిలిచింది. డాక్టర్ రాధా కృష్ణతో పాటు మేడ్చల్‌-మల్కాజిగిరి డీఈవో విజయకుమారి కూడ ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు. ఈ నెల 23న ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM