byసూర్య | Sun, Mar 19, 2023, 10:08 AM
వచ్చే నెల 3 నుంచి దేవరకొండ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 3న పిఏపల్లి మండలం, 5న డిండి మండలం, 7న కొండమల్లెపల్లి మండలం, 9న నేరడుగొమ్ము మండలం, 11న చందంపేట మండలం, 13న దేవరకొండ మండలం, 16న చింతపల్లి మండలం, 18న దేవరకొండ పట్టణం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.