byసూర్య | Sun, Mar 19, 2023, 09:25 AM
తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి 3.724 శాతం డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జులై 1 నుండి 28.638 శాతం డీఏ చెల్లిస్తుండగా, ఈ ఏడాది జనవరి నుండి 32.362 శాతం ఇవ్వనున్నట్లు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ వెల్లడించారు. జనవరి, ఫిబ్రవరి డీఏను మార్చి జీతంతో కలిపి ఏప్రిల్ లో ఇవ్వనున్నట్లు తెలిపారు.