మృతదేహాన్ని 36 కిలోమీటర్లు లాక్కెళ్లిన రైలు ఇంజిన్,,,జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో దారుణం

byసూర్య | Fri, Jan 27, 2023, 09:28 PM

జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో దారుణం చోటు చేసుకొంది. ఒక వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా.. అతడి మృతదేహాన్ని ట్రైన్ ఇంజిన్ 36 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. 36 కిలోమీటర్ల తర్వాత మరో లోకో పైలట్ మృతదేహాన్ని గుర్తించాడు. రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న మృతదేహాన్ని రెండు గంటల పాటు కష్టపడి బయటకు తీశారు. తెలంగాణలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


హన్మకొండలోని నయిూంనగర్‌కు చెందిన గద్వాల ఉప్పలయ్య(72) వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య డిపార్ట్‌మెంట్‌లో జావాన్‌గా పనిచేసి కొన్నేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా.. గురువారం కాజీపేట సమీపంలో రైతు కింద పడి బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆ మార్గంలో వెళుతున్న చెన్నై-లక్నో అండ‌మాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌కు మృతదేహాం చిక్కుకుంది. దాదాపు 36 కిలోమీటర్ల మేర రైలు ఇంజిన్ ఉప్పలయ్య మృతదేహాన్ని ఈడ్చుకెళ్లింది. మరో లోకో పైలట్ మృతదేహాన్ని గుర్తించి జమ్మికుంట స్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో ట్రైన్‌ను జమ్మికుంటలో ఆపేశారు.


రైలు ఇంజిన్ లోపల చిక్కుకోవడంతో మృతదేహాన్ని బయటకు తీయడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. గడ్డపారతో తవ్వి మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. మృతుడి వద్ద ఆధార్ కార్డుతో పాటు సూసైడ్ లెటర్‌ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరు కారణం కాదని లెటర్‌లో రాసి ఉంది. ఆధార్ కార్డు వివరాల ఆధారంగా మృతుడి వివరాలను సేకరించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని పోలీసులు అందించారు. అప్పలయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఆత్మహత్య చేసుకోవడానికి అదే కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


గురువారం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, ఆ తర్వాత కాజీపేట సమీపంలో రైతు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని బంధువులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఆత్మహత్యకు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. కుటుంబసభ్యులు, బంధువులను ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం చేసిన తర్వాత కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అందించామని, ఆత్మహత్యపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆత్మహత్యనా? లేదా హత్యనా? అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.



Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM