ఉప్పల్లో సిసి రోడ్డు పనులు: ఎమ్మెల్యే

byసూర్య | Thu, Jan 26, 2023, 10:41 AM

ఉప్పల్ డివిజన్లో రూ. 77లక్షల వ్యయంతో చేపడుతున్న సిసి రోడ్డు పనులను బుధవారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, స్థానిక కార్పో రేటర్ మందముల్ల రజిత పరమేశ్వర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉప్పల్ మాల్ మైసమ్మ దేవాలయం మార్గంలో సిసి రోడ్డు, ఉప్పల్ బస్టాండ్ వెనుక గాంధీనగర్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో పెండిం గ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, గడ్డం రవికుమార్, వేముల సంతోష్ రెడ్డి, మస్క సుధాకర్, టంటం వీరేష్, కాంగ్రెస్ పార్టీ నేతలు బోరంపేట కృష్ణ, ఈగ పాండు, బాకారం లక్ష్మణ్, ఈ అంజయ్య, పండ్ల బాలయ్య, ఈగ బాబు, మహంకాళి రాజు, శేఖర్రెడ్డి, ఉల్పారాజు, సల్ల ప్రభాకర్ రెడ్డి, గొరిగె జహంగీర్, మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News
 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, Mar 28, 2024, 02:40 PM
బండి సంజయ్‌ పై కేసు నమోదు Thu, Mar 28, 2024, 02:34 PM
సమ్మర్ క్యాంప్ ద్వారా సరైన గైడెన్స్ అందించాలి: కలెక్టర్ Thu, Mar 28, 2024, 01:46 PM
మాతృ మరణాల నివారణకు పటిష్ట చర్యలు Thu, Mar 28, 2024, 01:43 PM
జైరాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి పర్యటన Thu, Mar 28, 2024, 01:41 PM