ఇది అంబేద్కర్ ను అవమానించడమే: బండి సంజయ్
byసూర్య |
Wed, Jan 25, 2023, 03:15 PM
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం రద్దు చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. ఇది రాజ్యాంగ స్పూర్తికే విరుద్ధమని, ఇలా చేయడం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించడమేనని విమర్శించారు. గవర్నర్ తన విధులు నిర్వహించకుండా కట్టడి చేయడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
Latest News