విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి ఏబీవీపీ డిమాండ్

byసూర్య | Wed, Jan 25, 2023, 02:51 PM

వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. కాలేజీ ఫీజుల రియంబర్స్మెంట్ తో పాటు స్కూళ్లు, కాలేజీలో నెలకొన్న సమస్యలపై బుధవారం మధ్యాహ్నం ఆత్మకూర్ గాంధీచౌక్ లో మానవ హారం గా ఏర్పడి నిరసన తెలిపారు. పట్టణంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమలుచేయాలనీ, కాలేజీలోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు, జిల్లా లీడర్లు పాల్గొన్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM