byసూర్య | Wed, Jan 25, 2023, 02:52 PM
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని జిల్లా గ్రామంలోని ఆరోగ్య సబ్ సెంటర్ లో రెండవ విడిత కంటి వెలుగు శిబిరాన్ని మహబూబాబుద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటి వెలుగు శిబిరాలను గ్రామాల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆమె వెంట ఎంపీపీ గుగులోత్ అరుణ రాంబాబు, జెడ్పిటిసి తేజావాత్ శారదా రవీందర్, ఇంచార్జి డిపిఓ ధన్ సింగ్, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.