byసూర్య | Wed, Jan 25, 2023, 01:29 PM
సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏడవ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర నాయకులు చాంద్ పాషా, బ్రహ్మానందం, శ్రీనివాసులు కోరారు. ఈ మేరకు బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి సివిక్ కార్యాలయంలో బుధవారం సంబంధిత మహాసభల పోస్టర్ ను వారు ఆవిష్కరించి మాట్లాడారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.