byసూర్య | Wed, Jan 25, 2023, 01:28 PM
ఆర్మూర్ పట్టణంలోని బిఆర్ఎస్ క్యాంప్ ఆఫీసులో మంజూరైన కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని మాజీ కౌన్సిలర్ సడక్ వినోద్ తెలిపారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సడక్ వినోద్ మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే పియుసి చైర్మన్ జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని బుధవారం తెలిపారు. దేశంలోని ఎక్కడలేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే సీఎం కేసీఆర్ పాలనలో పేద కుటుంబాలకు ఆదుకునే విధంగా పథకాలను తీసుకొచ్చారని, పథకాలను నిరుపేద కుటుంబాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కళ్యాణ లక్ష్మి చెక్కులను మంజూరుకు కృషిచేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే పియుసి చైర్మన్ జిల్లా అధ్యక్షులు ఆశన్న జీవన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.