byసూర్య | Tue, Jan 24, 2023, 02:30 PM
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కొహిర్ మండలం కొహిర్ ఎక్స్ రోడ్డు సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అలుగడ్డల లోడుతో వెళ్తున్న డిసిఎం వాహనం కొహిర్ ఎక్స్ రోడ్డు కెజిఎన్ వద్ద యూ టర్న్ చేస్తున్న సమయంలో ద్విచక్ర వాహనం డ్డీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై వ్యక్తికి కాలు విరగగా మహిళలకు సల్పగాయలు అయ్యాయి. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న కొహిర్ ఎస్ఐ సురేష్, ఎల్ అండ్ టి అంబులెన్స్ లో జహీరాబాద్ ఆసుపత్రికి తరలించారు. వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్ ను అదుపు చేశారు.