byసూర్య | Sun, Dec 04, 2022, 09:38 PM
టీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులకు మర్యాద లేకుండా పోయిందని మాజీ మంత్రి, బీజేపీ నేత రవీంద్ర నాయక్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం వందల మంది ప్రాణత్యాగం చేశారని, ఉద్యమకారుల పట్ల కేసీఆర్ కు కనీస సానుభూతి లేదని మండిపడ్డారు. నాడు కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో తన ఇంటిని ఆఫీసు కోసం ఇచ్చారని, ఇప్పుడది అదృశ్యమైందని అన్నారు.
కేసీఆర్ తన పరపతి కోల్పోయినప్పుడల్లా సెంటిమెంట్ రగుల్చుతారని రవీంద్ర నాయక్ విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కూతురిని కాపాడుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు.