byసూర్య | Fri, Dec 02, 2022, 08:41 PM
బీజేపీ రాజకీయాలు దేశంలో అందరికీ తెలుసని, ఎన్నికలు వస్తున్నాయంటే ఈడీలు, ఐటీలతో ఆ పార్టీ దాడులు చేయించడం సహజమేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీవ్ రావు అన్నారు. అంతేకాదు బీజేపీ వదిలే బాణాలు, పెట్టించే పార్టీలు కూడా ఉంటాయని పరోక్షంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై విమర్శలు గుప్పించారు. బీహార్, యూపీలాంటి రాష్ట్రాల్లో అయితే బీజేపీ బాణాలు, పార్టీలు, కుట్రలు నడుస్తాయని.. ఉద్యమాల గడ్డ తెలంగాణలో అవి నడవవని అన్నారు. కవితతో కలిసి హరీశ్ రావు జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ నెల 7న జరిగే కేసీఆర్ బహిరంగసభకు సంబంధించిన ఏర్పాట్లను వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.