byసూర్య | Fri, Dec 02, 2022, 07:21 PM
మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మాగంటి వీరాంజనేయులు నియామకం అయ్యారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న ఆయన శుక్రవారం స్థానికంగా మాట్లాడారు. అధిష్టానం ఆదేశాల మేరకు బీసీల సమస్యలపై పోరాడుతానని చెప్పారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లేపల్లి అంజి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ లు కృష్ణయ్య ని గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, బైకానీ వెంకన్న యాదవ్, గొర్రెల కాపర సంఘం అధ్యక్షులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.