byసూర్య | Thu, Dec 01, 2022, 01:55 PM
తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామ పంచాయతీలోని యాదవ సంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నిధుల నుండి రూ. 5 లక్షల మంజూరు చేశారు. కాగా గురువారం యాదవ సంఘం బిల్డింగ్ స్లాబ్ పనులను ఆమనగల్ మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. దీనికి సహకరించిన ఆమనగల్ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చుక్కాపూర్ ఎంపిటిసి నాలాపురం వందనకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ మావిలపల్లి వెంకటరెడ్డి, చుక్కాపూర్ రైతు గ్రామ కమిటీ అధ్యక్షుడు గుమ్మకొండ మల్లారెడ్డి, మాజీ ఎంపిటిసి పర్వతాలు, శ్రీశైలం, మల్లేష్, యాదయ్య, చెన్నయ్య, వార్డ్ మెంబర్ శీను, భీష్మచారి, వీరయ్య, దరువుల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.