ప్ర‌తిష్టాత్మ‌కంగా బర్డ్స్ ఎన్ క్లోజర్: మంత్రి

byసూర్య | Thu, Dec 01, 2022, 01:52 PM

దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కెసిఆర్ అర్బన్ ఎకో పార్క్ లో బర్డ్స్ ఎన్ క్లోజర్ ను ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పక్షుల కిలకిల రావాలు వినేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు తరలి వచ్చేలా బర్డ్స్ ఎన్ క్లోజర్ ను తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. ఈనెల 4వ తేదీన సీఎం కేసీఆర్. బర్డ్స్ ఎన్ క్లోజర్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న నేపథ్యంలో మంత్రి అర్బన్ ఎకో పార్కును అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.


800 రకాల పక్షులను ఒకేచోట ఏర్పాటు చేయడంతో పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందన్నారు. బర్డ్స్ ఎన్ క్లోజర్ లోపలికి వెళ్లి దగ్గరి నుంచి పక్షులను తిలకించేందుకు అవకాశం ఉంటుందని, అక్కడే ఏర్పాటు చేసిన వాటర్ ఫాల్స్ మందు నిలబడి సెల్ఫీలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. దేశంలోనే అతిపెద్దదైన కెసిఆర్ అర్బన్ ఎకో పార్క్ ను తెలంగాణకు ఒక ఐకాన్ లా తీర్చిదిద్దుతామని తెలిపారు. స‌మీక్ష‌లో ఆర్ అండ్ బి (జాతీయ రహదారులు) ఈ ఎన్ సి గణపతి రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, సీసీఎఫ్ క్షితిజ, వాస్తు శిల్పి సుద్దాల సుధాకర్ తేజ, డీఎఫ్ఓ సత్యనారాయణ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM