నేను ఎక్కడికీ పారిపోలేదు: మాజీ మేయర్
byసూర్య |
Thu, Dec 01, 2022, 11:31 AM
మూడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లారని వస్తున్న వార్తలను హైదరాబాద్ నగర మాజీ మేయర్, టీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్ ఖండించారు. తాను ఎక్కడికీ వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానని ఆయన తెలిపారు. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ విచారిస్తున్న నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ తో తనకు ఎలాంటి పరిచయం లేదని చెప్పారు. కమ్యూనిటీకి సంబంధించిన ఫంక్షన్ లో కొందరు నాయకులను శ్రీనివాస్ కలిశారని, ఇదే విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ కూడా చెప్పారని అన్నారు. ఆయనతో అంతకు మించి పరిచయం లేదని చెప్పారు.శ్రీనివాస్ అనే వ్యక్తి తప్పు చేస్తే తమకు ఏం సంబంధమని అన్నారు.
Latest News