byసూర్య | Thu, Dec 01, 2022, 11:33 AM
ప్రతి ఏడాది డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అని అందరికీ తెలిసిన విషయమే. ఎయిడ్స్ వ్యాధి ఇప్పటికీ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. గత ఏడాది కొత్తగా 15 లక్షల మందికి ఎయిడ్స్ సోకింది. ప్రపంచ వ్యాప్తంగా 3.84 కోట్ల మంది హెచ్ఐవీతో బాధపడుతూ జీవిస్తున్నారనే అంచనా ఉంది. భారత్ లో సుమారు 24 లక్షల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారు.
హెచ్ఐవీ, ఎయిడ్స్ రెండూ ఒకటి కాదు. హెచ్ఐవీని నిర్లక్ష్యం చేస్తే అది ఎయిడ్స్గా మారుతుంది. హెచ్ఐవీ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది రోగనిరోధకశక్తిని నిర్వీర్యం చేస్తుంది. సీడీ4 తెల్ల రక్తకణాలలోకి చేరి వృద్ధి చెందుతుంది. ఫలితంగా సీడీ4 కణాల సంఖ్య పడిపోయి, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో వివిధ రకాల వ్యాధులు సంక్రమిస్తాయి. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ కు సరైన చికిత్స తీసుకోకపోతే అది చివరికి ఎయిడ్స్గా మారుతుంది. హెచ్ఐవీని రక్తపరీక్ష ద్వారా గుర్తిస్తారు.