సీఎం కేసీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన షర్మిల

byసూర్య | Sat, Nov 26, 2022, 04:07 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజలతో కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు అని ఆమె అన్నారు. ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుపడతారని విమర్శించారు. గత ఎనిమిదేళ్లలో ఆయన ఇచ్చిన ప్రతి హామీ మోసమేనన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలన్నీ ఒక్కటేనన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయాయని ఆరోపించారు. అబద్ధపు హామీలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం బలంగా ఉంటే కేసీఆర్ ఆటలు సాగేవి కాదు అని ఆమె అన్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ సంక్షేమ పాలన వస్తుంది అని షర్మిల అన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM