byసూర్య | Tue, Nov 22, 2022, 08:38 PM
ఐదో దశ ప్రజాసంగ్రామ పాదయాత్రకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సమయం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 28న బాసరలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైంసా నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. డిసెంబర్ 15 లేదా 16వ తేదీ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ముగింపు సభ కరీంనగర్లో జరగనుంది. ప్రజాసంగ్రామ యాత్ర సహ ప్రముఖ్ వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ బండి సంజయ్ గత 4 దశల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,178 కిలోమీటర్లు తిరిగారన్నారు.