byసూర్య | Tue, Nov 22, 2022, 08:32 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ఎర్రగూడ అటవీ ప్రాంతంలో ఫారెస్టు రేంజర్ శ్రీనివాసరావును గుత్తికోయలు హత్య చేసిన సంగతి తెలిసిందే. అటవీ భూముల్లో పోడు వ్యవసాయం విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో గుత్తికోయలు శ్రీనివాసరావుపై కత్తులు, వేట కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అటవీ అధికారి శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. అంతేకాదు శ్రీనివాసరావు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, పదవీ విరమణ వయస్సు వరకు జీతం ఇస్తామని వెల్లడించారు.