ఫారెస్ట్ రేంజర్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం కెసిఆర్

byసూర్య | Tue, Nov 22, 2022, 08:32 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం ఎర్రగూడ అటవీ ప్రాంతంలో ఫారెస్టు రేంజర్ శ్రీనివాసరావును గుత్తికోయలు హత్య చేసిన సంగతి తెలిసిందే. అటవీ భూముల్లో పోడు వ్యవసాయం విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో గుత్తికోయలు శ్రీనివాసరావుపై కత్తులు, వేట కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అటవీ అధికారి శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు. అంతేకాదు శ్రీనివాసరావు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, పదవీ విరమణ వయస్సు వరకు జీతం ఇస్తామని వెల్లడించారు.


Latest News
 

రాజాసింగ్‌కు కాల్ చేసిన టెలీకాలర్.. దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన ఎమ్మెల్యే Tue, May 07, 2024, 10:13 PM
హైదరాబాద్‌లో తరచూ పవర్ కట్స్.. విద్యుత్ శాఖ కీలక నిర్ణయం Tue, May 07, 2024, 10:08 PM
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు Tue, May 07, 2024, 10:03 PM
నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి Tue, May 07, 2024, 09:58 PM
జీరో ట్రాఫిక్ కోసం అండర్‌పాస్‌, ఫ్లైఓవర్లు.. మాల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి స్పెషల్ మేనిఫెస్టో Tue, May 07, 2024, 09:55 PM