byసూర్య | Tue, Nov 22, 2022, 08:14 PM
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. నోటీసులు ఇచ్చిన ముగ్గురు విచారణకు హాజరుకాలేదని సిట్ హైకోర్టుకు తెలిపింది. నిందితులు విచారణకు సహకరించడం లేదని ఏజీ హైకోర్టుకు తెలిపారు. సిట్ విచారణకు హాజరు కావాలని బీఎల్ సంతోష్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది. సోమవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తమ ముందు ఉంచాలని పేర్కొంది.