byసూర్య | Wed, Sep 28, 2022, 10:08 PM
రాష్ట్రంలో మరో కొత్త మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. నిజామాబాద్ జిల్లాలోని 14 గ్రామాలతో పోతంగల్ మండలాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అభ్యంతరాలు, వినతులను 15 రోజుల్లోపు నిజామాబాద్ కలెక్టర్ కు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా రెండు రోజుల క్రితమే రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.