byసూర్య | Thu, Sep 29, 2022, 11:04 AM
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్ట్ లో బుధవారం కురిసిన వర్షానికి వరదల రూపంలో ఎక్కువ మొత్తం లో నీరు వచ్చి చేరింది. కావున సింగూరు ప్రాంత ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు సంబంధిత అధికారులు హెచ్చరికలు జారిచేసారు. సింగూర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల ప్రాజెక్టుకు 9 వేల క్యూసెక్కులు వరద నీరు వస్తున్నది. కావున, ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా వరద నీటిని దిగువ ప్రాంతానికి వదలడం జరుగుతుంది కాబట్టి ప్రాజెక్టు దిగువ ప్రాంతాల వారు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోగలరు. మంజీరా నది పరివాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పశువులు, గొర్ల కాపరులు మరియు చేపల వేటకు పోయే వారు నది లోనికి వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.