byసూర్య | Wed, Sep 28, 2022, 10:08 PM
దసరా పండుగకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, యశ్వంతపూర్ స్టేషన్ల మధ్య 10 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైళ్లు అక్టోబర్ 1 నుంచి 21వ తేదీ వరకు రాకపోకలు కొనసాగిస్తాయన్నారు. టిక్కెట్ రిజర్వేషన్ల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.