byసూర్య | Wed, Sep 28, 2022, 08:38 PM
విదేశాల్లో పెట్టుబడులు పెట్టి ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు బుధవారం రెండో రోజు విచారించారు. తొలిరోజు మంగళవారం మంచిరెడ్డిని 9 గంటల పాటు విచారించిన ఈడీ.. రెండో రోజు బుధవారం 10 గంటల పాటు విచారించింది.మంచిరెడ్డి బ్యాంకు లావాదేవీలపైనా ఈడీ అధికారులు ప్రశ్నించారు.