byసూర్య | Thu, Sep 22, 2022, 11:38 PM
ఇబ్రహీంపట్నంను వీరపట్నంగా మార్చాలా.. వద్దా? అని బీజేపీ నేత బండి సంజయ్ ప్రశ్నించారు ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ భారత్-పాక్ క్రికెట్ జరిగే ప్రతిసారి పాతబస్తీలో పాక్ జెండాలు పట్టుకుని తిరిగేవారని, బీజేపీ వచ్చాక జాతీయ జెండాలు పట్టుకున్నారని తెలిపారు.నిజాం సర్కారును తరిమికొట్టిన గడ్డ వీరపట్నం అని చెప్పారు. ఒవైసీకి ఐఎన్ఏ తీవ్రవాదులు మాత్రమే కనబడతారని విమర్శించారు. డేట్, టైం ఫిక్స్ చేయి నీతో లడాయికి మేం సిద్ధం అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. గడీల రాజ్యం కావాలా? రామరాజ్యం కావాలో ప్రజలే తేల్చుతారన్నారు.