byసూర్య | Thu, Sep 22, 2022, 02:23 PM
కరీంనగర్ లో బీసీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. ఈనెల 30న జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మూడో ఆవిర్భావ దినోత్సవ సదస్సు పోస్టర్లను తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య యాదవ్ ఈ సందర్భంగా బిసి సంఘ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కుమారస్వామి, బహుజన సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇంఛార్జి దాసరి ఉష, కుమార్, ప్రసాద్, నిఖిల్, బీరన్న, పున్నం ప్రసాద్, రాజేశషం, శ్రీకాంత్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.