byసూర్య | Tue, Aug 16, 2022, 09:34 PM
తెలంగాణలో గత 24 గంటల్లో 27,348 నమూనాలను పరీక్షలు చేయగా అందులో 406 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్లో 177, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 32, రంగారెడ్డి జిల్లాలో 27 కేసులు నమోదయ్యాయి. 581 మంది ఫలితాలు రావాల్సి ఉంది.అదే సమయంలో, 494 మంది కరోనా నుండి కోలుకున్నారు. కొత్త మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,22,667 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది కరోనా కారణంగా మృతి చెందారు.