బీజేపీ జెండా చూసి మోసపోవద్దు : సీఎం కేసీఆర్

byసూర్య | Tue, Aug 16, 2022, 08:55 PM

బీజేపీ జెండా చూసి మోసపోవద్దని, మోసపోతే బాధ పడాల్సి వస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ సభలో అన్నారు. వికారాబాద్ జిల్లా టీఆర్ ఎస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు కేంద్రం నిరాకరిస్తున్నదని, తెలంగాణ బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆగిపోయిందని, కృష్ణా జలాల్లో నీటి వాటాను కేంద్రం తేల్చాలని డిమాండ్‌ చేశారు. కానీ తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం మోడీని చూసి భయపడుతున్నారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు తెచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.బీజేపీ జెండా చూసి మోసపోతే ఉచిత కరెంటు రాదని, మోటార్లకు మీటర్లు పెడతారని తెలిపారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM