'మోడీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ వక్రీకరిస్తోంది'
byసూర్య |
Tue, Aug 16, 2022, 05:03 PM
ఉచిత సంక్షేమ పథకాలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ వక్రీకరిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. పేదలకు మేలు జరగాలనేదే మోడీ వ్యాఖ్యల ఉద్దేశమన్నారు. తెలంగాణలో నిజాం రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. పాదయాత్రకు ప్రజలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు.
Latest News