byసూర్య | Wed, Aug 10, 2022, 11:59 AM
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లోని కేజీబీవీలో పదో తరగతి విద్యార్థిని కవిత(15) చనిపోయింది. దంతన్పల్లి జెండాగూడకు చెందిన కవిత సోమవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో పాఠశాల సిబ్బంది ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం కవిత చనిపోయింది. కవిత అనారోగ్యంతో చనిపోయిందని పాఠశాల సిబ్బంది చెప్తున్నారు. తమ కుమార్తె మృతిపై దర్యాప్తు జరపాలని కవిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది.