సీతాఫలండిలో ఇంటింటికీ జాతీయ జెండాలను అందజేస్తున్న పద్మారావుగౌడ్

byసూర్య | Wed, Aug 10, 2022, 11:28 AM

స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికి దక్కేలా తమ వంతు కృషి చేస్తున్నామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. సీతాప లండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద స్వతంత్ర భారత వత్రోత్సవాల్లో భాగంగా ఇంటిం టికి జాతీయ జెండాలు అందించే కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్, పలువురి కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ స్వతంత్ర వేడుకలను సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్, కంది శైలజ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ దశరథ్, మెడికల్ ఆఫీసర్ రవీందర్ గౌడ్, ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.


Latest News
 

అదే జరిగితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: మంత్రి కోమటిరెడ్డి Wed, Apr 24, 2024, 07:58 PM
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ కీలక విషయాలు.. బెయిల్ పిటిషన్ రిజర్వ్ Wed, Apr 24, 2024, 07:53 PM
సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌దే గెలుపు.. ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుంది: రేవంత్ రెడ్డి Wed, Apr 24, 2024, 07:49 PM
తుపాకీ మిస్ ఫైర్.. సీఆర్‌పీఎఫ్‌ డీస్పీపీ మృతి Wed, Apr 24, 2024, 07:42 PM
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రయాణాలు సాగించేవారికి గుడ్‌‍న్యూస్ Wed, Apr 24, 2024, 07:37 PM