byసూర్య | Wed, Aug 10, 2022, 11:28 AM
స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికి దక్కేలా తమ వంతు కృషి చేస్తున్నామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. సీతాప లండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద స్వతంత్ర భారత వత్రోత్సవాల్లో భాగంగా ఇంటిం టికి జాతీయ జెండాలు అందించే కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్, పలువురి కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ స్వతంత్ర వేడుకలను సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్, కంది శైలజ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ దశరథ్, మెడికల్ ఆఫీసర్ రవీందర్ గౌడ్, ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.