byసూర్య | Sat, Aug 06, 2022, 01:43 PM
వాట్సాప్, ఫేస్బుక్ల డిస్ప్లే పిక్చర్ (డీపీ) మార్చాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని, దాని వల్ల ఉపయోగం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ జీడీపీ పెంచే దిశగా చర్యలు చేపట్టాలని ట్విట్టర్లో శుక్రవారం పేర్కొన్నారు. పేదలకు సాయం చేయకుండా, కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్ల రుణాలను ప్రధాని మోడీ మాఫీ చేశారని విమర్శించారు. పతనం అవుతున్న రూపాయి విలువ పెంచే దిశగా చర్యలు చేపట్టాలని హితవు పలికారు.