byసూర్య | Sat, Aug 06, 2022, 01:45 PM
ఈ నెల 7న నిర్వహించనున్న ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం నిర్వహించనున్న పరీక్షకు మొత్తం 538 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 554 ఎస్సై పోస్టులకు 2,47,217 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని టీఎస్పీఎల్ఆర్బీ స్పష్టం చేసింది.