వివాహిత అదృశ్యం.. పోలీసులకు ఫిరియాదు

byసూర్య | Sat, Aug 06, 2022, 12:16 PM

సంగారెడ్డి జిల్లా రాయికొడ్ వివాహిత ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని సంగాపూర్ గ్రామంలో చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి స్థానిక ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాయికోడ్ మండలంలోని సంగాపూర్ గ్రామానికి చెందిన ఆశంగారి గాల్ రెడ్డి కుమారుడు ఆశంగారి మోహన్ రెడ్డికి ఝరాసంగం మండలంలోని జోనగామ గ్రామానికి చెందిన చిట్యాపు నరసింహరెడ్డి కుమార్తె గాయత్రి(19)తో గత ఏడాది క్రితం పెళ్లి జరిగిందన్నారు. అప్పటినుండి వారి సంసారం సాఫీగా సాగిందన్నారు.


అంతలో ఏమి జరిగిందో ఏమో గానీ గురువారం రాత్రి కుటుంబ సభ్యులతోపాటు గాయత్రి మేన మామ కాపు సంగారెడ్డితో కలిసి భోజనం చేసి నిద్రపోతున్నట్లు పేర్కొన్నారు. అదేరోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో భర్త మోహన్ రెడ్డి లేచి చూడగా ఆమె కనిపించలేదు. చుట్టుప్రక్కల, బంధువుల ఇంటి వద్ద వెతికినా గాయత్రి ఆచూకీ లభించలేదు. దీంతో భర్త మోహన్ రెడ్డి తన భార్య కనిపించడం లేదని శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏడుకొండలు తెలిపారు.


Latest News
 

మందుబాబులకు మరోసారి బ్యాడ్‌న్యూస్.. ఆ 3 రోజులు వైన్స్, బార్లు బంద్ Wed, May 08, 2024, 07:27 PM
మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు Wed, May 08, 2024, 04:20 PM
వెల్గటూర్ మండలంలో ప్రభుత్వ విప్ ఎన్నికల ప్రచారం Wed, May 08, 2024, 04:17 PM
ఐఎస్ఆర్డీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన Wed, May 08, 2024, 04:14 PM
బహిరంగ సభ ఏర్పాట్ల పనులను పరిశీలించిన ఎంపీ అభ్యర్థి Wed, May 08, 2024, 04:11 PM