byసూర్య | Sat, Aug 06, 2022, 12:07 PM
అక్రమ గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర నిందితులను శనివారం అరెస్ట్ చేసిన జిల్లా ఎస్పి రెమా రాజేశ్వరి ఐపిఎస్. ఎస్పీ మాట్లాడుతూ.. నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం. వారి వద్ద నుండి (200) గంజాయి ప్యాకెట్లు ఒక్కొక్కటి 2 కేజీలు మొత్తం 400 కేజీల గంజాయి మొత్తం విలువ రూ. 12 లక్షలు, మూడు కార్లు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర డి. జి. పి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపడంతో పాటు నిరంతరం నిఘాలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు తిప్పర్తి పోలీసులు జిల్లా టాస్క్ఫోర్స్ బృందం సమన్వయంతో నల్గొండ హైవేపై వివిధ ప్రదేశాలలో డైనమిక్ వాహన తనిఖీలు నిర్వహించి మూడు కార్లను ఎక్స్యూవీ 500, బాలెనో, స్విఫ్ట్ డిజైర్, నలుగురు గంజాయి స్మగ్లర్లను పట్టుకుని 200 కిలోల గంజాయి, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది.