byసూర్య | Sat, Aug 06, 2022, 12:19 PM
ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఐదవ రోజును పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన గుండు శివకుమార్ తన అరచేతిపై అద్భుతమైన త్రివర్ణ పతాకం పెయింట్ వేసి తన దేశభక్తి అభిమానాన్ని చాటుకున్నాడు. అర చేతిలో, 5 గోళ్ళపై ఆజాది కా తిరంగా చిత్రాలు వేసి అబ్బుర పరచాడు. ఈ దశలో ప్రభుత్వం ఈనెల 8 నుంచి 20వ తేదీ వరకు వజ్రోత్సవం వేడుకలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ సందర్భంగా చిత్రకారుడు శివకుమార్ మాట్లాడుతూ ఈ వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, జాతీయ పతాకాలను తమ ఫోన్ ప్రొఫైల్ లో పెట్టుకోవాలని కోరారు.