హైదరాబాద్ కు వస్తున్న స‌ఫ్రాన్...వెల్ కం అంటూ స్వాగతిస్తున్న కేటీఆర్

byసూర్య | Wed, Jul 06, 2022, 05:39 PM

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దినదినం పురోగతి సాధిస్తోంది. తాజాగా ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ కేంద్రంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్న ఏరో ఇంజిన్ రిపేర్ సంస్థ స‌ఫ్రాన్ తెలంగాణ‌లోకి అడుగుపెట్ట‌బోతోంది. మరోవైపు హైద‌రాబాద్‌లో ఎంఆర్ఓ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసిన స‌ఫ్రాన్‌కు కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు.  తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఆ సంస్థ విమానాల మెయింటెనెన్స్ అండ్ రిపేర్ (ఎంఆర్ఓ) యూనిట్‌ను నెల‌కొల్ప‌నుంది. హైదరాబాద్‌లో నెల‌కొల్ప‌నున్న ఎంఆర్ఓ యూనిట్ ఆ సంస్థ అన్ని యూనిట్ల‌లోకి అతి పెద్ద‌దిగా నిల‌వ‌నుంది. హైద‌రాబాద్ యూనిట్ కోసం ఆ కంపెనీ తొలి విడ‌త‌గా 150 మిలియ‌న్ డాల‌ర్ల‌ను పెట్టుబ‌డిగా పెట్ట‌నుంది.


మరోవైపు హైద‌రాబాద్‌లో ఎంఆర్ఓ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసిన స‌ఫ్రాన్‌కు కేటీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. ఏరో ఇంజిన్ రిపేర్ రంగంలో భారత్‌లో ఇప్ప‌టిదాకా ఏ విదేశీ కంపెనీ త‌న యూనిట్‌ను ఏర్పాటు చేయ‌లేద‌న్న కేటీఆర్‌...హైద‌రాబాద్‌లో సఫ్రాన్ ఏర్పాటు చేయ‌నున్న యూనిట్ భార‌త్‌లో తొలి విదేశీ కంపెనీ యూనిట్‌గా రికార్డుల‌కు ఎక్క‌నుంద‌ని తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 800 నుంచి 1,000 మంది యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని ఆయ‌న తెలిపారు. అంతేకాకుండా ఈ యూనిట్ ద్వారా ఏరోస్పేస్ రంగంలో హైద‌రాబాద్‌కు మ‌రిన్ని పెట్టుబ‌డులు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని ఆయ‌న తెలిపారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM