త్వరలోనే బీజేపీలో చేరతా: రచనా రెడ్డి

byసూర్య | Wed, Jul 06, 2022, 05:45 PM

త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు తెలంగాణ హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి వెల్లడించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌‌తో ఆమె భేటీ అయ్యారు. పార్టీలో చేరాల్సింది సంజయ్ ఆమెను ఆహ్వానించినట్లు సమాచారం. తెలంగాణ హైకోర్టు న్యాయవాదిగా సుపరిచితురాలైన రచనా రెడ్డి గతంలో తెలంగాణ జనసమితిలో చేరారు. అయితే కొద్దిరోజులకే పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో విభేదాలు రావడంతో పార్టీ ఉపాధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బయటికి వచ్చేశారు. అప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీలోనూ చేరని ఆమె తాజాగా బీజేపీ వైపు మొగ్గు చూపడం ఆసక్తి రేపుతోంది.  అనంతరం మీడియాతో మాట్లాడిన రచనా రెడ్డి.. బీజేపీలో చేరికపై సంజయ్‌తో చర్చలు జరిపానని.. త్వరలోనే బీజేపీలో చేరతానని వెల్లడించారు. అయితే పార్టీలో ఎప్పుడు చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని.. త్వరలోనే తేదీ ప్రకటిస్తానని తెలిపారు. ఇదిలావుంటే రచనా రెడ్డి న్యాయవాదిగా తనదైన ముద్ర వేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ముంపు రైతుల తరపున హైకోర్టులో కేసులు వేసి వాదించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రచనా రెడ్డి వేసిన కేసులను అసెంబ్లీలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తావించడం విశేషం.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM