బాలిక ప్రాణాలు తీసిన...ఐదు రూపాయలు

byసూర్య | Wed, Jul 06, 2022, 05:45 PM

మీ పిల్లలు దేనితో ఆడుతున్నారో ప్రతి తల్లిదండ్రులు  పరిశీలిస్తూ ఉండాలి. ఒకవేళ డబ్బుల బిల్లలతో మీ పిల్లలు ఆడుకొంటూవుంటే  జాగ్రత్తగా ఉండండి. వాటిని వారు మింగేసి ప్రాణాల మీదకు తెచ్చుకొనే అవకాశముంది. ఇదిలావుంటే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ రూ.5ల కాయిన్ మింగేసిన నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. భూదాన్‌ పోచంపల్లి పట్టణంలోని వెంకటరమణ కాలనీకి చెందిన బొంగు మహేశ్, సరిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె చైత్ర(4) వారం రోజుల క్రితం ఇంటివద్ద ఆడుకొంటూ ఐదు రూపాయల కాయిన్ మింగేసింది. అది గొంతులో ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స చేసి చిన్నారి గొంతులోని కాయిన్ తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


అయితే చిన్నారి సోమవారం అస్వస్థతకు గురై శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో తల్లిదండ్రులు చైత్రను అదే ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. కాయిన్ ఇరుక్కోవడం వల్ల గొంతులో ఇన్‌ఫెక్షన్ సోకి చిన్నారి మరణించి ఉండొచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముద్దుముద్ద మాటలతో అల్లరి చేస్తూ ఆడుకునే చిన్నారి అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM