byసూర్య | Tue, Jul 05, 2022, 10:18 AM
యాదగిరిగుట్ట లో ఆటో కార్మికుల సమ్మె సోమవారం కి 99వ రోజులు గడుస్తున్న ప్రభుత్వ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే కూడా ఇంతవరకు సమస్య పరిష్కారం చేయలేదని ఆటో కార్మికులు తెలిపారు. దేవస్థానం ఈవో కార్మికులపై కక్ష సాధింపులతో ముందుకు వెళ్తున్నారు, జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మార్వో , వై టి డి ఎ అధికారులకు ఎన్నోసార్లు వినపత్రం ఇచ్చిన ఎలాంటి స్పందన కనబడకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రి ని కలసి గోడు చెప్పుకుందామని అనుకున్న సమయంలో ఎక్కడికక్కడ అరెస్టులు చేయిస్తున్నారు, 300ఆటో కార్మికుల బ్రతుకులు రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు, యాదగిరిగుట్ట గుడి డెవలప్ అయితుంది అంటే మా బతుకులు మారుతాయి అని అనుకున్నాం, కానీ ఇలా రోడ్డున పడతామని కలలో కూడా ఊహించలేదని ఇకనైనా మా కుటుంబాలని ఆదుకోవాలని కోరుకుంటూ మా సమస్య ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మనసారా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని వేడుకున్నారు