byసూర్య | Sat, May 21, 2022, 03:14 PM
తన పార్టీ మార్పు అంశం అధిష్టానం వైఖరి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. ఇదిలావుంటే గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాలపై రాజగోపాల్ రెడ్డి తాజాగా స్పందించారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో తాను కొనసాగేది.. లేనిది.. పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయని వ్యాఖ్యానించారు.