రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
byసూర్య |
Tue, May 17, 2022, 01:57 PM
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్లాపూర్ సమీపంలో ఫోర్ లైన్ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో షరీఫ్ అనే వ్యక్తి మృతి చెందాడు. తాండూర్ కు చెందిన షరీఫ్ బైక్ పై మంచిర్యాల వైపు వెళ్తుండగా మంచిర్యాల నుంచి మందమర్రి వైపు వస్తున్న కారు ఢీ కొనడంతో షరీఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ లో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై మహేందర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Latest News