ప్లాటు విక్రయిస్తేనే వివాహం.. యువతి ఆత్మహత్య!

byసూర్య | Tue, May 17, 2022, 12:53 PM

నిశ్చితార్థం తర్వాత ప్లాట్‌ను విక్రయించాలని ఓ యువకుడు డిమాండ్ చేయడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా హాలియా మండలం పంగవానికుంట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పంగవానికుంటకు చెందిన మెగావత్ వెంకటేశ్వర్లు కుమార్తె నవత(22)కు త్రిపురారం మండలం లకుపతితండాకు చెందిన ధనవత్ జగపతిబాబుతో ఇటీవల నిశ్చితార్థం జరిగింది. కట్నం కింద వరుడికి రూ. రూ.20 లక్షల విలువైన ప్లాట్ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.


డిగ్రీ చదువుతున్న సమయంలో జగపతిబాబు ఆటో డ్రైవర్‌గా పని చేయడంతో వీరిద్దరూ గతంలో ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే పెళ్లి తేదీ ఖరారు కాలేదు. తనకు ప్లాటు వద్దని, దానిని అమ్మి నగదు ఇవ్వాలని నవతకు జగపతిబాబు కొద్దిరోజులుగా ఫోన్‌చేసి బెదిరిస్తున్నాడు. అమ్మి నగదు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ఖరాఖండిగా చెప్పాడు. దీంతో ఈ విషయాన్ని నవత తన సోదరుడికి చెప్పగా, ప్లాటును విక్రయించేది లేదన్నాడు. దీంతో నవత ఎవరికీ చెప్పలేక మనస్తాపంతో సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఈ ఘటనపై తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM