byసూర్య | Tue, May 17, 2022, 12:43 PM
కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఏటీకేడు పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు మెరుగుపర్చాల్సి ఉన్నా.. ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదని యాత్రికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, వసతి సమస్య ప్రధానంగా వేధిస్తోంది. 15 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు, వంద కోట్లతో మాస్టర్ ప్లాన్ కార్యచరణ కాగితాల్లోనే మూలుగుతున్నాయి